తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,04,668 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి.
అలాగే మొత్తం ఏడు రౌండ్లలో 21,309 ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ స్థానంలో గెలుపొందాలంటే మొత్తం 1,68,520 ఓట్లు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లు, అవసరమైతే మూడో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించే అవకాశం ఉంది. ఇక్కడ 93 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో తుది ఫలితం వెల్లడయ్యేందుకు మరింత సమయం పట్టనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ