తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3982 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 17, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,36,766 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 5186 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 4,85,644 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 90.47 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 27 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3012 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 607, రంగారెడ్డిలో 262, ఖమ్మంలో 247, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 225, నల్గొండలో 246, కరీంనగర్ లో 188, నాగర్ కర్నూల్ లో 146, వరంగల్ అర్బన్ లో 142, భద్రాద్రి కొత్తగూడెంలో 142 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ