రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్ధతుగా తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసింది. మంగళవారం నాడు టీఐఎఫ్ సభ్యులు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావును కలుసుకుని విదేశాల నుంచి దిగుమతి చేసిన 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను అందించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టీఐఎఫ్ అందించిన సహకారానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ