తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. కోత్తగా 477 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 27, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,99,532 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 98.99 శాతంకాగా, మరణాల రేటు 0.51 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 279 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 7,91,461 కు చేరుకుంది. ప్రస్తుతం 3,960 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. సోమవారం నాడు 25,989 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,55,32,200 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 9,54,653 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 653 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY