తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే కొనసాగుతుంది. కొత్తగా 494 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 9, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,26,778 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 223, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 36, రంగారెడ్డిలో 34, నల్గొండలో 14, రాజన్న సిరిసిల్లలో 14, మహబూబ్ నగర్ 13, జనగామలో 12, సంగారెడ్డిలో 11, మహబూబాబాద్ లో 10 నమోదయ్యాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,107 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 1054 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,17,560 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.89 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY