నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కరోనాతో మృతి చెందారు. ఇటీవలే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోగీని ఆనందయ్య ఆయుర్వేద మందును (కంట్లో చుక్కలు) తీసుకున్న అనంతరం తానూ కోలుకున్నానని, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయంటూ కోటయ్య మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం కోటయ్య ఆరోగ్యం క్షీణించగా, మే 23 నుంచి నెల్లూరు జీజీహెచ్ లో చేరి చికిత్స పొందుతున్నారు. మే 29 తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా, ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మరణించినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ