తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 569 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 7, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,48,957 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 657 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,36,552 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.08 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3823 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82, కరీంనగర్ లో 64, వరంగల్ అర్బన్ లో 51, ఖమ్మంలో 40, నల్గొండలో 39, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 33, రంగారెడ్డిలో 27, పెద్దపల్లిలో 27 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ