తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 852 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 27, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 8,16,531 కి చేరింది. రాష్ట్రంలో థర్డ్వేవ్ విజృంభణ అనంతరం మళ్ళి 800కు పైగా రోజువారీ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 358, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 63, రంగారెడ్డిలో 57, పెద్దపల్లిలో 35, మహబూబాద్ లో 32, ఖమ్మంలో 28, నల్గొండలో 26, జనగామలో 26, హనుమకొండలో 26, కరీంనగర్ లో 24, మంచిర్యాలలో 23, భద్రాద్రి కొత్తగూడెంలో 22 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 640 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,07,505 కు చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూలై 27, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,63,54,726
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,16,531
- కొత్తగా నమోదైన కేసులు : 852
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 8,07,505
- కరోనా రికవరీ రేటు: 98.89%
- యాక్టీవ్ కేసులు : 4,915
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య : 4,111
- కరోనా మరణాల రేటు: 0.50%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY