మూడో వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం.. 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

IND vs WI 3rd ODI Team India Beats West Indies by 119 Runs To Clean Sweep The Series 3-0, Team India Beats West Indies by 119 Runs To Clean Sweep The Series 3-0, Team India Beats West Indies by 119 Runs, Team India Clean Sweep The Series 3-0, Team India Beats West Indies, IND vs WI 3rd ODI, India beat West Indies by 119 runs in 3rd ODI, IND vs WI 3rd ODI Highlights, 3rd ODI Highlights, IND vs WI, IND vs WI 3rd ODI News, IND vs WI 3rd ODI Latest News, IND vs WI 3rd ODI Latest Updates, IND vs WI 3rd ODI Live Updates, Mango News, Mango News Telugu,

కరేబియన్‌ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకున్నది. విండీస్‌ గడ్డపై 39 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరిసారిగా 1983లో అప్పటి భారత జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. ఇక వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 119 పరుగుల తేడాతో విండీస్‌పై భారీ గెలుపును సొంతం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుసార్లు అంతరాయం ఏర్పడటంతో 36 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 225 పరుగులు సాధించింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ విధానంలో వెస్టిండీస్ జట్టు 35 ఓవర్లలో 257 పరుగులు చేయాల్సి వచ్చింది.

అయితే లక్ష్య సాధనలో విండీస్ జట్టు 26 ఓవర్లు ఆడి 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. వెస్టిండీస్‌ జట్టులో కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (32 బంతుల్లో 42 రన్స్‌), బ్రెండన్‌ కింగ్‌ (42) మాత్రమే చేసి పర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు పడగొట్టగా, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారత జట్టులో ఓపెనర్లు శిఖర్‌ ధవన్ (74 బంతుల్లో 58; 7x 4), శుభ్‌మన్‌ గిల్‌ (98 బంతుల్లో 98 నాటౌట్; 7x 4, 2x 6) రాణించారు. అయితే శుభ్‌మన్‌ వర్షం కారణంగా శతకం అందుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కు నిరాశ కలిగించే అంశం ఇదొక్కటే. అలాగే ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులను శుభ్‌మన్‌ గిల్‌ సొంత చేసుకున్నాడు.

ఈ విజయం ద్వారా ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో ఒక జట్టును డబుల్‌ వైట్‌వాష్‌ చేసిన మూడో జట్టుగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ పర్యటనకు వచ్చిన విండీస్‌ 3-0తో వైట్‌వాష్‌ అయింది. అంతకుముందు 2006లో బంగ్లాదేశ్‌.. కెన్యాను, అలాగే 2001లో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను రెండు సార్లు క్లీన్‌స్వీప్‌ చేశాయి. ఇక వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టు మంగళవారం ట్రినిడాడ్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌, పంత్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌తో కూడిన పూర్తిస్థాయి జట్టు శుక్రవారం నుంచి జరిగే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతినివ్వగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు కూడా దూరంగా ఉన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =