తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్/మే 2022లో జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఎస్.ఎస్.సీ బోర్డు ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జనవరి 29లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ప్రకటించారు. అయితే తాజాగా పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఎస్.ఎస్.సీ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.ఎస్.సీ/ఓఎస్ఎస్సీ/వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ లో ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు ఏప్రిల్/మే 2022 వార్షిక పరీక్షల కోసం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 14వ తేదీవ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుల వివరాలు:
- ఫీజు చెల్లింపు తుది గడువు : ఫిబ్రవరి 14 (ఆలస్య ఫీజు లేకుండా)
- రూ.50 ఆలస్య ఫీజుతో చెల్లింపుకు చివరి తేదీ : ఫిబ్రవరి 24
- రూ.200 ఆలస్య ఫీజుతో చెల్లింపుకు చివరి తేదీ: మార్చి 4
- రూ.500 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: మార్చి 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ