తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. దీనికి సంబంధించి టీఎస్ ఈఆర్సీ గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చింది. 19 శాతం పెంచాలని డిస్కమ్లు అనుమతి కోరగా, 14 శాతం పెంపుకు అనుమతినిచ్చింది. దీంతో గృహ వినియోగదారులకు యూనిట్ మీద 40 పైసల నుంచి 50 పైసలు పెంచనున్నారు. ఇతర కేటగిరీలపై యూనిట్కు రూపాయి చొప్పున పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ టి. రంగారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. డిస్కమ్లు రానున్న ఐదేళ్లకు ఛార్జీల టారిఫ్ ను కమిషన్ కు సమర్పించాయని, అయితే దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుందని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. దీని వలన వినియోగదారులపై అదనపు భారం పడుతుందని, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ