తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24, శుక్రవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 983 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. గత 24 గంటల్లో కొత్తగా 13 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. జీహెఛ్ఎంసీ ఏరియా, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలలోనే ఎక్కువుగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వికారాబాద్ లో 14 కుటుంబాల్లో 38 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబాల్లో 83 మందికి, గద్వాల లో 30 కుటుంబాల్లో 45 మందికి, జీహెఛ్ఎంసీ పరిధిలో 44 కుటుంబాల్లో 260 మందికి కరోనా వైరస్ సోకినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందగా, 291 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం 667 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 24, శుక్రవారం మధ్యాహ్నానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 62 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కర్నూల్ లో 27, కృష్ణాలో 14, గుంటూరులో 11, అనంతపూర్ లో 4, ప్రకాశం జిల్లాలో 3, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో ఒక కేసు చొప్పున మొత్తం 62 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 955 కు పెరిగింది. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, మరో 145 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు. ఇక ప్రస్తుతం 781 మంది చికిత్స పొందుతున్నారు.
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 62 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 955 పాజిటివ్ కేసు లకు గాను 145 మంది డిశ్చార్జ్ కాగా, 29 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 781#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Y9Gd2bi7Ix— ArogyaAndhra (@ArogyaAndhra) April 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]