సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్ర‌శేఖ‌ర్, రావెల కిషోర్ బాబు, పలువురు ఏపీ నేతలు

Thota Chandrasekhar Ravela Kishore Babu Parthasarathi Joins in BRS Party in the Presence of CM KCR,Thota Chandrasekhar, Ravela Kishore Babu, Parthasarathi, Joins in BRS Party,Mango News,Mango News Telugu,Telangana BRS Govt,Rythu Bandhu,Telangana Rythu Bandhu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) ద్వారా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే దిశగా ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ వేగవంతం అయింది. ఈ క్రమంలో ఏపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థి సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ వారికి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, పార్టీ కండువాలు కప్పారు.

వీరితో పాటుగా ఏపీలోని అనంతపురంకు చెందిన టీజే ప్ర‌కాశ్‌, కాపునాడు జాతీయ అధ్య‌క్షుడు తాడివాక ర‌మేశ్ నాయుడు, కాపునాడు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గిద్ద‌ల శ్రీనివాస్ నాయుడు, ఏపీ ప్ర‌జా సంఘాల జేఏసీ అధ్య‌క్షుడు రామారావు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరగా, సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువాలు క‌ప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా ఈ చేరికల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ప‌లువురు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 19 =