తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ నాటి విద్యార్థి సంఘం నేత ఎం.శ్రీధర్ రెడ్డి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తొలి, మలి దశల్లో తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి చేసిన కృషిని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నాటి 1969 ఉద్యమంలో క్రియాశీలంగా, కీలక పాత్రను పోషించారని, తాను నమ్మిన విలువల కోసం శ్రీధర్ రెడ్డి కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎం.శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE