ఉద్యోగ భద్రత లేని ‘అగ్నిపథ్’తో ఉపయోగం లేదు, రద్దు చేయాల్సిందేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సత్యాగ్రహ’ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా మల్గాజ్గిరి కూడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడే జవానులను అవమనించేలా బీజేపీ సర్కార్ చర్యలున్నాయని విమర్శించారు. నాలుగేళ్లు సైన్యంలో పని చేసిన తరువాత వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే వారి భవిష్యత్ పరిస్థితి ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అగ్నిపథ్ పథకంపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, అయితే ఇలాంటివాటికి కాంగ్రెస్ భపడదని, అగ్నిపథ్ను రద్దు చేసేదాకా పోరాటం కొనసాగిస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. అగ్నిపథ్తో సైనికులకు ఉద్యోగ భద్రత లేదని, పెన్షన్ లేదని, చివరికి మాజీ సైనికుల హోదా కూడా లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తెలంగాణ యువకులపై నిరసనలకు వ్యతిరేకంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని కోరాలని సూచించారు. పార్టీలకు అతీతంగా కేసులలో ఇరుక్కున్న యువకులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY