రాష్ట్రంలో ప్రజా సమస్యలపై డిసెంబర్ 5 వరకు విడతల వారీగా పోరాడనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తో భేటీ అయింది. తెలంగాణలో భూసమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు సీఎస్ కు మెమోరండం అందజేశారు. సీఎస్ ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు బలరాం నాయక్, డా.మల్లు రవి, రాములు నాయక్ మరియు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి తదితరులు ఉన్నారు.
ధరణి పోర్టల్ ను రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలని, నిషేదిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వడం, కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడం సహా వివిధ అంశాలపై సీఎస్ సోమేశ్కుమార్ వారు వినతిపత్రం అందజేశారు. ఈ భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేస్తూ, “రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారం, ధరణి ఘోరాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దశల వారిగా పోరాడేందుకు సిద్ధమైంది. తొలి దశలో సీఎస్ కు వినతిపత్రం ఇచ్చాం. సర్కారు స్పందనను బట్టి తదుపరి కార్యచరణ ఉంటుంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE