ఖమ్మం లకారంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్ ప్యారడైజ్ ను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మహాత్మా గాంధీజీ జయంతి నాడు మినీ లకారం ట్యాంక్ బండ్ నందు వాకర్స్ ప్యారడైజ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరానికి మరో మణిహరంగా నిలిచి నగర ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచుతుందని పేర్కొన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో పార్క్ ను ఆధునీకరించి వాకింగ్, జాగింగ్, యోగ, ఓపెన్ జిమ్, గ్రీనరి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక సదుపాయాలు కల్పించామన్నారు.
అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా బల్క్ చెత్తను సేకరించేందుకు “వేస్ట్ ఆన్ వీల్స్” కార్యక్రమ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ శానిటరీ వర్కర్స్ కి ప్రశంసాపత్రాలు, టోపిలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu