సింగరేణి కాలరీస్ సంస్థ 2021-22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. సింగరేణి సంస్థ కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యోగుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
“దేశంలోనే ఎక్కడా లేని విధంగా, అత్యంత ఎక్కువ మొత్తంలో దసరా బోనస్ అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఈ ఏడాది అర్హులైన సింగరేణి కార్మికులకు 368 కోట్ల రూపాయలను అందించనుండటం గొప్ప విషయం. కార్మికుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత ముందుకు సాగుతూ, దేశానికి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY