తెలంగాణ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ 6 స్థానాల్లోనూ అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఫలితాల అనంతరం నిర్వహించే విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
నల్గొండలో తెరాస అభ్యర్థి ఎంసి కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస తరపున బరిలోకి దిగిన తాతా మధు 238 ఓట్ల తేడాతో గెలిచారు. మెదక్ లో అధికార పార్టీ అభ్యర్థి యాదవ రెడ్డి 524 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆదిలాబాద్ లో తెరాస అభ్యర్థి దండె విఠల్ 667 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో అధికారపార్టీ నుంచి పోటీలో దిగిన ఎల్ రమణ, భానుప్రసాద్ విజయం సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ