కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి షాద్నగర్ బూర్గుల గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాస్తారోకో నిర్వహించారు. కేటీఆర్ తో పాటుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ ఎంపీ కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు భారత్ బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐ స్టాండ్ విత్ ఫార్మర్స్, ఫార్మర్స్ నాట్ టెర్రరిస్ట్స్ (రైతులు తీవ్రవాదులు కాదు) అనే ప్లకార్డును మంత్రి కేటీఆర్ ప్రదర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ