ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రశాంత్ కిషోర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్కు, టీఆర్ఎస్కు మధ్య బంధం ముగిసిందని.. ఇకపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాల ప్రకారం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానని, అదే ఇప్పుడు కార్యరూపం దాలుస్తోందని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనతో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందన్న వదంతులను కొట్టిపడేసారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. టీఆర్ఎస్, బీజేపీల నుంచి తెలంగాణను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన వాదించారు. అయితే పీకే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసి ఒక ప్రెజంటేషన్ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కోసం ఏమి చేయాలో వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లోనే ప్రశాంత్ కిషోర్ను పార్టీలో చేర్చుకునే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా ప్రకటించటం గమనార్హం. దీనిని బట్టి త్వరలోనే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ