తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కాగా గ్రూప్-4 దరఖాస్తులకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక ఇప్పటి వరకు మొత్తం 8,47,277 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఈ ఒక్క రోజే 34,247 దరఖాస్తులు అందాయని తెలిపింది. తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు, జూనియర్ అకౌంటెంట్లు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో గత డిసెంబర్ 30 నుంచి జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. నేటితో గడువు ముగియనుండగా, ఫిబ్రవరి 3 వరకు గడువును పొడిగించింది. ఇక ఆన్లైన్లో గ్రూప్-4 దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిన టీఎస్పీఎస్సీ, దీనికోసం తన అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో అప్లై చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE