తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గానూ నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్-2021 ను రద్దు చేస్తునట్టు ప్రకటించారు. కరోనా మహమ్మారి (కోవిడ్-19) విజృంభన నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం టీఎస్ఆర్జేసీ సెట్ ను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందడానికి గాను పదోతరగతిలో వచ్చిన సిజిపిఎ మరియు గ్రేడుల ఆధారంగా కళాశాలలో అడ్మిషన్లను కేటాయించడం జరుగుతుందన్నారు. అడ్మిషన్ల వివరాలు www.tswreis.in వెబ్ సైట్ సందర్శించి, సబ్జెక్టులలో మరియు మొత్తం సిజిపిఎలో పొందిన పదోతరగతి గ్రేడ్లను అప్ లోడ్ చేయాలని సూచించారు. సిజిపిఎ మరియు గ్రేడింగ్ ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని, అందుకోసం పదోతరగతిలో వచ్చిన సిజిపిఎ మరియు గ్రేడులను జూన్ 2 నుండి జూన్ 7 వరకు అప్ లోడ్ చేయవచ్చని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ