తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఆర్ట్స్ & సైన్స్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిటిడబ్ల్యుఆర్జెసి సెట్ – 2020 రాత పరీక్షా ఫలితాలు జూలై 4, శనివారం నాడు విడుదల అయ్యాయి. మార్చ్ 8 న జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 10052 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. కాగా రాష్ట్రంలో మొత్తం 73 జూనియర్ కాలేజీల్లో 7040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు మరియు ఇతర వివరాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ www.tgtwgurukulam.telangana.gov.in ని సందర్శించాలని అధికారులు సూచించారు.
కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థులకు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని చెప్పారు. కాలేజీల్లో చేరే తేదీని త్వరలో ప్రెస్ నోట్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు వారి సెలక్షన్ కాపీని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. అలాగే కాలేజీల్లో చేరే సమయంలో హాల్ టికెట్, కుల ధృవీకరణ పత్రం, ఎంపిక కాపీ, టిసి, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు పాస్పోర్ట్ సైజు ఫోటో సహా అన్ని సంబంధిత పత్రాలతో సిద్ధంగా ఉండాలని విద్యార్థులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu