తెలంగాణ రాష్ట్రంలో మరో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 3, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,462 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 5965 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 283 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1126 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 10195 కి చేరింది. ప్రస్తుతం 9984 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1892):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1658
- రంగారెడ్డి – 56
- మేడ్చల్ – 44
- వరంగల్ రూరల్ – 41
- సంగారెడ్డి – 20
- నల్గొండ – 13
- మహబూబ్ నగర్ – 12
- మహబూబబాద్ – 7
- కామారెడ్డి – 6
- రాజన్న సిరిసిల్ల – 6
- వనపర్తి – 5
- భద్రాద్రి కొత్తగూడెం – 4
- సిద్దిపేట – 3
- మెదక్ – 3
- నిజామాబాద్ – 3
- ఖమ్మం – 2
- నిర్మల్ – 2
- కరీం నగర్ – 1
- గద్వాల్ – 1
- ములుగు – 1
- జగిత్యాల -1
- వరంగల్ అర్బన్ -1
- నాగర్ కర్నూల్ – 1
- వికారాబాద్ -1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu