తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్కతుర్తి మండలం వల్భాపుర్ గ్రామంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో సుమారు 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా రెండు బస్సుల డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ