తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు విడుదల

Education Minister, Education Minister Sabitha Indra Reddy, Educational Institutions In telangana, Mango News, Opening of Educational Institutions, Opening of Educational Institutions In Telangana, Sabitha Indra Reddy, Sabitha Indra Reddy On Opening of Educational Institutions, Telangana Education Minister Sabitha Indra Reddy, Telangana Educational Institutions

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 9, 10, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతుల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది.

విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాలు ఇవే:

  • విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విషయంలో తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
  • ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులకు యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులు కొనసాగించవచ్చు.
  • 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించవద్దు, డిటెన్షన్‌ కూడా ఉండదు.
  • 9 తరగతి నుంచి పైతరగతులకు బోధించే ఉపాధ్యాయులు ప్రతి రోజూ హాజరు కావాలి.
  • ఈ సంవత్సరం పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు కనీస హాజరు శాతం తప్పనిసరి కాదు.
  • 70 శాతం సిలబస్‌ బోధన, మిగిలిన 30శాతం సిలబస్‌ ప్రాజెక్ట్‌ వర్క్స్‌ మరియు అసైన్‌మెంట్స్.
  • 10 వ తరగతి పరీక్షలు షెడ్యూలు తర్వాత విడుదల, పరీక్షలు ముగిసిన రోజునే చివరి పనిదినంగా పరిగణన.
  • జూనియర్ కాలేజీల్లో 300 కంటే తక్కువ విద్యార్థులు ఉంటే ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు తరగతులు నిర్వహణ.
  • 300 కంటే ఎక్కువుంటే రెండు షిఫ్టులుగా 8.30 నుంచి 12.30 వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు మరియు 1.30 నుంచి 5.30 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించాలి.
  • ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ త్వరలోనే ప్రకటన.
  • డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల్లో 50 శాతం మంది విద్యార్థులను అనుమతించి భౌతికదూరం పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి. రొటేషన్‌ పద్ధతిలో తరగతులు జరగాలి.
  • డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కోర్సుల విద్యార్థులకు ఈ సెమిస్టర్ లో కనీస హాజరు తప్పనిసరి కాదు.
  • పాఠశాలలు, కాలేజీలు పూర్తిగా శానిటైజేషన్‌ చేయాలి. విద్యాసంస్థల ఆవరణ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థల్లో కనీసం రెండు ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేసుకోవాలి. శానిటైజర్లను అందుబాటులో ఉంచి, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + four =