కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతోంది. కార్పోరేషన్స్ లో మొత్తం 60 డివిజన్లకు గాను రెండు డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 58 డివిజన్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 27న చేపట్టనున్నారు. మరోవైపు రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లోని మూడు బూత్లలో నేడు రీపోలింగ్ జరుగుతుంది.
జనవరి 22న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓట్లు దాఖలు కావడంతో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కామారెడ్డిలోని 41వ వార్డు 101వ పోలింగ్ బూత్, నిజామాబాద్ జిల్లా బోధన్ 32వ వార్డు 87వ పోలింగ్ బూత్, మహబూబ్నగర్లోని 41వ వార్డులో 198వ పోలింగ్ బూత్ లలో ఈ రోజు రీపోలింగ్ ప్రారంభమైంది. కామారెడ్డిలోని 41వ వార్డు వద్ద ఉద్రికతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
[subscribe]