ఇంటిని చక్కదిద్దటంతో పాటు, ఉద్యోగాల్లోనూ రాణించటం మహిళలకు ఉన్న ఓర్పు, ప్రావీణ్యతకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ అన్నారు. క్షేత్ర స్థాయిలో సవాళ్లతో కూడిన అటవీ సంరక్షణ లాంటి విధుల్లో కూడా మహిళలు విజయవంతంగా రాణించటం గొప్ప విషయమని కొనియాడారు. ఈ రోజు (మార్చి 8, బుధవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరణ్య భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో రాణించిన ఉద్యోగినులను బహుమతులను అందించారు. ఈ వేడుకల్లో పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అదనపు పీసీసీఎఫ్ (అడ్మిన్) సునీతా భగవత్, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE