ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన మరో ఏడుగురు పాకిస్తాన్ క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహమ్మద్ హాఫిజ్, వహాబ్ రియాజ్ సహా మరో ఏడుగురుకు కోవిడ్-19 కు పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలినట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) జూన్ 23, మంగళవారం నాడు వెల్లడించింది. కరోనా బారిన పడిన వారిలో హఫీజ్, రియాజ్, కాశీఫ్ భట్టి, మహమ్మద్ హస్నైన్, ఫఖర్ జమాన్, మహమ్మద్ రిజ్వాన్, ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.
ఇక షాదాబ్ ఖాన్, హైదర్ అలీ మరియు హరిస్ రౌఫ్ లకు గత సోమవారం నాడే కరోనా పాజిటివ్ గా తేలగా, కరోనా బారిన పడిన మొత్తం జట్టు సభ్యుల సంఖ్య 10 కి చేరుకుంది. అలాగే జట్టు సహాయక సిబ్బంది సభ్యుడైన మలాంగ్ అలీకి కరోనా సోకినట్టు పిసిబి ప్రకటించింది. జూన్ 25 న ఈ ఆటగాళ్లందరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, అనంతరం ఇంగ్లాండ్ పర్యటనకు సవరించిన జట్టు సభ్యుల జాబితాను ప్రకటిస్తామని బోర్డు సీఈఓ వసీం ఖాన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu