నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “మా నాన్నకు కరోనా పాజిటివ్ గా తేలింది మరియు కొన్ని కరోనా లక్షణాలను కలిగివున్నారు. నేను, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా మాతో సంప్రదించిన వారంతా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి” అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా జీ మంచి ఆరోగ్యంగా ఉండాలని మరియు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే ఒమర్ అబ్దుల్లాను ట్యాగ్ చేస్తూ “మీ మరియు మొత్తం కుటుంబం యొక్క మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాము” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Praying for the good health and speedy recovery of Dr. Farooq Abdullah Ji.
Also praying for your and the entire family’s good health @OmarAbdullah. https://t.co/a3Qw1axCNH
— Narendra Modi (@narendramodi) March 30, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ