దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 15,968 కరోనా పాజిటివ్ కేసులు, 465 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి చెందడం మొదలయ్యాక అత్యధికంగా ఒకేరోజున ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో జూన్ 24, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,56,183 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు ఎక్కువుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 139010 కు, ఢిల్లీలో 66602, తమిళనాడులో 64603, గుజరాత్ లో 28429 కు చేరుకుంది.
అలాగే కొత్తగా నమోదైన 465 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 14,476 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో 2,58,685 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,83,022 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రోజువారీగా నమోదవుతున్న కేసులతో పోల్చితే భారత్ లో కూడా అత్యధిక కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. కాగా దేశంలో చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితుల సంఖ్య కంటే వైరస్ లక్షణాలు నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగిస్తుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 24th June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 456,183
▶️ Active cases: 183,022
▶️ Cured/Discharged/Migrated: 258,685
▶️ Deaths: 14,476#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/B3CjpIyrR8
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu