రాష్ట్రంలో రైతుబంధు పంపిణీపై వనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రైతుబంధు పథకం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో వ్యవసాయ శాఖ దాదాపు ఏడువేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులను విజయవంతంగా పంపిణీ చేసిందని చెప్పారు. రైతుబంధు నిధుల పంపిణీ ఒక ప్రపంచ రికార్డని, కేవలం 36 గంటలలో రికార్డు ఖాతాలలో డబ్బులు వేశాం, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం, వ్యవసాయం పట్ల ఇంత సానుకూల విధానం లేదని మంత్రి అన్నారు.
“వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రైతుబంధు, రైతుభీమా వంటి ప్రభుత్వ సానుకూల విధానాలతో తెలంగాణ రైతుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి రైతుకు రైతుబంధు అందాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. ప్రతి రైతు తన ఖాతా, పాస్ బుక్ వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద సరిచేసుకోవాలి రైతుబంధు పథకం కింద ఈ ఏడాది వానకాలం సీజన్ కు గాను 55.06 లక్షల రైతులకు చెందిన కోటీ 39 లక్షల 76 వేల ఎకరాలకు గాను రూ.6987.90 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ వారంలో 1.96 లక్షల మంది రైతులు బ్యాంకు వివరాలు నమోదు చేసుకేవడం జరిగింది. ఇందుకు సంబంధించిన రూ.214.75 కోట్లు త్వరలోనే జమ చేయబడతాయని” మంత్రి పేర్కొన్నారు.
“ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు జూలై 5 వరకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు వివరాలు నమోదు చేయించు కోవాలి. 28 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగ్గా లేవు. వారికి డబ్బులు జమచేసినా వారి ఖాతాలకు చేరలేదు. ఐఎఫ్ఎస్ సి కోడ్ గానీ, మూసివేయబడిన ఖాతాలు ఇవ్వడం లేదా సరైన ఖాతా నంబరు ఇవ్వక పోవడం వల్ల నిధులు జమకాలేదు. వారు వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి తమ ఖాతాలు సరిచేయించుకోవాలి. 11 వేల మంది రైతుల బ్యాంక్ పాస్ బుక్ పేరు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ లలో పేర్లలో వ్యత్యాసం ఉన్నందున సరిదిద్దేందుకు ఆదేశించడం జరిగింది. రైతుబంధు నిధులు రైతులకు చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని” మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu