తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1982 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 8, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 79,495 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 627 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.78% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1669 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 55,999 కి చేరింది. ప్రస్తుతం 22,869 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 70.44 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 463, మేడ్చల్ లో 141, రంగారెడ్డి జిల్లాలో 139, కరీంనగర్ లో 96, జోగులాంబ గద్వాల లో 93, జనగామలో 78, పెద్దపల్లిలో 71, వరంగల్ అర్బన్ లో 71, భద్రాద్రి కొత్తగూడెంలో 64, కామారెడ్డిలో 62, నల్గొండలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu