తెలంగాణ రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 30, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 3457 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 260 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1712 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7294 కి చేరింది. ప్రస్తుతం 8785 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(945):
- జీహెచ్ఎంసీ ఏరియా – 869
- రంగారెడ్డి – 29
- సంగారెడ్డి – 21
- మేడ్చల్ – 13
- నిర్మల్ – 4
- కరీంనగర్ – 2
- మహబూబ్ నగర్ – 2
- సిద్ధిపేట – 1
- ఖమ్మం – 1
- సూర్యాపేట – 1
- వికారాబాద్ – 1
- నిజామాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu