ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 200 వ రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సమయంలో కూడా రైతులు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విజయవాడ లోని జేఏసీ కార్యాలయం వద్ద ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, రైతు కూలీలకు జేఏసీ నేతలు, రైతులు నివాళులు అర్పించారు. పలువురు రైతులు దీక్షలో కూర్చోగా వారికీ మద్దతుగా మహిళలు కూడా దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు రైతులు, జేఏసీ నేతలు ఈ దీక్షను కొనసాగించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu