తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కళ్యాణలక్ష్మి పథకంపై జూలై 15, బుధవారం నాడు బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ బి.సి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బి.సి మరియు ఈ.బి.సి వధువులకు రూ.675 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ విడుదలైన బడ్జెట్ ను 2016-17 నుండి 2018-19 వరకు ఉన్న బకాయిలకై రూ.44.11 కోట్లు, 2019-2020 మరియు 2020-2021 లబ్దిదారులకై రూ.591.35 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. రెవెన్యూ డివిజినల్ అధికారులు ఈ నిధులను త్వరితగతిన అర్హులైన వారికి విడుదల చేయాలని కోరారు. ఇప్పటి నుండి ఈ పథకం యొక్క ప్రగతిని రెవెన్యూ డివిజన్ల వారీగా ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్ సెక్రెటరీతో కలిసి సమీక్షించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu