తెలంగాణ రాష్ట్రంలో జూలై 16, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,018 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు కొత్తగా 1676 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 1296 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 27,295 కి చేరగా, ప్రస్తుతం 13,328 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన మరణించిన వారి సంఖ్య 396 కి చేరుకుంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1676):
- జీహెచ్ఎంసీ – 788
- రంగారెడ్డి – 224
- మేడ్చల్ – 160
- కరీంనగర్ – 92
- నల్గొండ – 64
- సంగారెడ్డి – 57
- వనపర్తి – 51
- వరంగల్ అర్బన్ – 47
- నాగర్కర్నూల్ – 30
- మెదక్ – 26
- నిజామాబాద్ – 20
- సూర్యాపేట – 20
- మహబూబాబాద్ – 19
- ఖమ్మం – 10
- జయశంకర్భూపాలపల్లి – 8
- వికారాబాద్ - 8
- పెద్దపల్లి – 7
- నారాయణపేట – 7
- మహబూబ్నగర్ – 6
- భద్రాద్రికొత్తగూడెం – 6
- సిద్దిపేట – 5
- కామారెడ్డి – 5
- జోగుళాంబగద్వాల – 5
- మంచిర్యాల – 4
- రాజన్న సిరిసిల్ల – 3
- వరంగల్ రూరల్ – 1
- జగిత్యాల – 1
- యాదాద్రిభువనగిరి – 1
- జనగామ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu