మాస్క్ ధరించడం‌ తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

Andhra govt makes wearing of face mask at public, Andhra Pradesh, Andhra Pradesh Corona News, Andhra Pradesh Latest News, Andhra Pradesh News, AP Govt has Issued Orders on Wearing Mask, Corona Outbreak, Coronavirus Updates, India Coronavirus Updates, Order to wear face mask issued in Andhra Pradesh

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమయంలో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ‌ ప్రభుత్వం జూలై 17, శుక్రవారం నాడు ఉత్తర్వులు చేసింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పేస్ మాస్కు లేదా పేస్ కవర్ ఉండటాన్ని తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కు ధరించడంపై విస్తృత ప్రచారం చేసి, ప్రజలకు అవగాహనా కల్పించి ఒక అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టవలసిందిగా కలెక్టర్లు, ఎస్పీలు మరియు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =