కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమయంలో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జూలై 17, శుక్రవారం నాడు ఉత్తర్వులు చేసింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పేస్ మాస్కు లేదా పేస్ కవర్ ఉండటాన్ని తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కు ధరించడంపై విస్తృత ప్రచారం చేసి, ప్రజలకు అవగాహనా కల్పించి ఒక అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టవలసిందిగా కలెక్టర్లు, ఎస్పీలు మరియు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu