తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో జూలై 24, శుక్రవారం నాడు ఒక్కరోజే 6785 కరోనా పాజిటివ్ కేసులు, 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకే రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,749 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 92,206 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు గురువారం నాటికీ రాష్ట్రంలో 22,23,019 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (జూలై 24, శుక్రవారం):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 1,99,749
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,43,297
- యాక్టీవ్ కేసులు – 53,132
- జూలై 24 న నమోదైన కేసులు – 6785
- జూలై 24 న డిశ్చార్జ్ అయినవారు – 6504
- జూలై 24 న నమోదైన మరణాల సంఖ్య – 88
- మొత్తం మరణాల సంఖ్య – 3320
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu