తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూలై 24, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (స్టేట్ ఓపెన్ స్కూల్) హైదరాబాద్ పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులలో రిజిష్టర్ చేసుకొని, ఏప్రిల్/మే-2020 లో పబ్లిక్ పరీక్షలుకు హాజరు కావడానికి అర్హత కలిగిన విద్యార్థులను ప్రతీ సబ్జెక్టులో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించారు.
సైన్సు మరియు వృత్తివిద్యా కోర్సులలో కూడా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోసం రిజిష్టర్ చేసుకున్న విద్యార్థులను ప్రతీ సబ్జెక్టులో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించారు. అలాగే అదనపు సబ్జెక్టు మరియు ప్రాక్టికల్ పరీక్షలలకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులను 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించారు. విద్యార్ధులు ఎవరైతే 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనారో, వారు వారి యొక్క మార్కులను ఇంప్రూవ్ చేసుకోవడానికి సార్వత్రిక విద్యాపీఠం “ఇంప్రూవ్ మెంట్ నియమ నిబందనలు” కు లోబడి తదుపరి నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబడతారని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా చదువుతున్న 35 వేలు మంది పదో తరగతి విద్యార్థులకు, 43 వేల మంది ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం వలన ప్రయోజనం కలిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu