తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలల మరియు కాలేజీల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 2 వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించట్లేదని పేర్కొన్నారు. 3 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు మాత్రమే ఆన్లైన్ తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలను బోధించనున్నారు.
ఆన్లైన్ తరగతుల నిర్వహణ మార్గదర్శకాలు:
- కిండర్గార్డెన్, నర్సరీ, ప్లేస్కూల్, ప్రీస్కూల్ విద్యార్థులకు వారంలో మూడు రోజులు – రోజుకు 45 నిముషాలు మాత్రమే (పెద్దలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో)
- 1 నుంచి 5 వ తరగతి విద్యార్థులకు వారంలో ఐదు రోజులు – రోజుకు రెండు తరగతులు – గరిష్టంగా గంటన్నర – ఒక్కో పాఠం 45 నిముషాలు మించరాదు
- 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వారంలో ఐదు రోజులు – రోజుకు మూడు తరగతులు – గరిష్టంగా రెండు గంటలు – ఒక్కో పాఠం 30 నుంచి 45 నిముషాలు మించరాదు
- 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారంలో ఐదు రోజులు – రోజుకు నాలుగు తరగతులు – గరిష్టంగా మూడు గంటలు – ఒక్కో పాఠం 30 నుంచి 45 నిముషాలు మించరాదు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu