తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 11 వేలు దాటింది. కొత్తగా 3018 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 25, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 61,040 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 780 కి పెరిగింది. ఇప్పటివరకు 85,223 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 25,685 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 76.30 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.69 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(3018):
- జీహెచ్ఎంసీ – 475,
- రంగారెడ్డి – 247
- మేడ్చల్ – 204
- నల్గొండ – 190
- ఖమ్మం – 161
- వరంగల్ అర్బన్ – 139
- నిజామాబాద్ – 136
- కరీంనగర్ – 127
- మంచిర్యాల – 103
- జగిత్యాల – 100
- భద్రాద్రి కొత్తగూడెం – 95
- సిద్ధిపేట – 88
- పెద్దపల్లి – 85
- కామారెడ్డి – 76
- రాజన్న సిరిజిల్లా – 69
- సూర్యాపేట – 67
- సంగారెడ్డి – 61
- వరంగల్ రూరల్ – 61
- మహబూబాబాద్ – 60
- మహబూబ్ నగర్ – 56
- జనగామ – 52
- వనపర్తి – 46
- యాదాద్రి భువనగిరి – 44
- నిర్మల్ – 41
- మెదక్ – 40
- నాగర్ కర్నూల్ – 38
- జోగులాంబ గద్వాల్ – 37
- ఆదిలాబాద్ – 28
- ములుగు – 26
- వికారాబాద్ – 21
- జయశంకర్ భూపాలపల్లి – 20
- నారాయణ్ పేట్ -14
- ఆసిఫాబాద్ – 11
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu