ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రస్తుతం ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏపీలో సెప్టెంబర్ 10 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,37,687 కి చేరుకుంది. వీరిలో 4,35,647 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 97338 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu