తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 57 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2216 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 12, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,57,096 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 56,217 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 961 కి పెరిగింది. ఇప్పటివరకు 1,24,528 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 31,607 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 79.2 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.61 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2216):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu