హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం తమ వంతు సాయంగా హెటిరో డ్రగ్స్ 10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. వరదల వల్ల ఎక్కువగా నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రయత్నాలకు స్పందించి ఈ సహాయం అందిస్తున్నట్లు హెటిరో డ్రగ్స్ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu