మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మంగళవారం సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆయన తన విచారణ సమయానికి కొంత సమయం ముందుగా ఈరోజు సీబీఐ విచారణకు తాను హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరుకాలేకపోవడానికి గల కారణాలను వివరించారు. తనకు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయని, అందుకే ఈరోజు సీబీఐ ముందు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. తన నియోజకవర్గంలో అటెండ్ కావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని, విచారణకు నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐని కోరానని, ఈ మేరకు సీబీఐ అధికారులకు లేఖ రాశానని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
అయితే వాస్తవానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆయనకు సీబీఐ సోమవారం సాయంత్రం 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయం ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అనేకసార్లు అవినాష్ రెడ్డిని విచారణ చేసి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో ఎంపీ పిటిషన్ వేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినాష్ విజ్ఞప్తిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE