జమ్మూ కశ్మీర్ లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో చిత్తూరు జిల్లా ఐరాల మండలం, రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీర మరణం పొందారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ ప్రవీణ్ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “దేశం కోసం ప్రవీణ్కుమార్ చేసిన త్యాగం చిరస్మరణీయం. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తుంది. వారి త్యాగం వెలకట్టలేనిది. ఆయన లేనిలోటు పూడ్చలేనిది. అయినప్పటికీ ఈ శోక సమయంలో కుటుంబానికి కాస్త ఆసరాగా ఉంటుందని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయడమైనది. దయచేసి స్వీకరించగలరని కోరుతున్నాను, ఈ కష్టాన్ని గట్టెక్కే ధైర్యాన్ని ప్రవీణ్ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ