గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 1 న పోలింగ్ జరిగిన సందర్భంలో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. దీంతో ఓల్డ్ మలక్పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఓల్డ్ మలక్పేట డివిజన్ లో ఈ రోజు రీపోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ డివిజన్లో 50 వేలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలింగ్ పక్రియ పూర్తయ్యాక సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అలాగే రేపు 150 డివిజన్లలో ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ