దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,823 కరోనా కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,95,660 కు, మరణాల సంఖ్య 1,52,718 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 1,97,201 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 16,988 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,02,45,741 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.70 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.44 శాతంగా ఉంది.
ఇక జనవరి 19 నాటికీ దేశవ్యాప్తంగా 18,85,66,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,64,120 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కేరళలో 6186, మహారాష్ట్రలో 2294, కర్ణాటకలో 645, తమిళనాడులో 543, గుజరాత్ లో 485, వెస్ట్ బెంగాల్ లో 412, ఛత్తీస్ గడ్ లో 383, ఉత్తరప్రదేశ్ లో 334 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ